అంగన్‌వాడీ టీచర్‌గా దారుణ హత్య

Published on

ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన ములుగు జిల్లా తడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం సుజాత అనే మహిళ కాటాపురంలో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నది. మంగళవారం ఆమె విధులు ముగించుకొని తన స్వగ్రామమైన ఏటూరునాగారం బయలుదేరారు. అయితే బుధవారం తాడ్వాయి సమీపంలోని అడవిలో తునికాకు కోసం వెళ్లిన కూలీలకు సుజాత మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సుజాతకు చెందిన నాలుగు తులాల బంగారం, సెల్‌ఫోన్‌ చోరీకి గురైనట్లు సీఐ శంకర్‌, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Related Posts

No Content Available
Search

Latest Updates