అమెరికాలో రోడ్డు ప్రమాదం, ఆంధ్రా విద్యార్ధి మృతి

Published on

అమెరికాలో విషాద చోటుచేసుకుంది.. న్యూయార్క్‌‌లో జరిగిన బైక్‌ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు బీలం అచ్యుత్‌ చనిపోయాడు. న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సిటీలో అచ్యుత్ చదువుతున్నాడు.. బుధవారం సాయంత్రం బైక్ ప్రమాదం జరిగింది. అతను బైక్ మీద వెళుండగా మరో వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగినపట్లు తెలుస్తోంది. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

అచ్యుత్ అకాల మరణం బాధించిందని.. మృతుడి కుటుంబ సభ్యులకు అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. స్థానిక అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు అచ్యుత్ మృతదేహాన్ని భారత్‌కు పంపే ప్రయత్నంలో ఉన్నట్లు భారత్ కాన్సులేట్ అధికారులు తెలిపారు.

Search

Latest Updates