ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీతో ఎక్స్‌క్లూజివ్

Published on

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ అగ్ర నాయకత్వం ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఒకవైపు రోడ్ షోలు, పబ్లిక్ మీటింగ్స్ నిర్వహిస్తూనే మీడియా ఇంటర్వ్యూల ద్వారా ప్రజలోకి చొచ్చుకెళ్ళేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తోంది. విలేఖరుల సమావేశం అంటేనే ఆమడ దూరం ఉండే మోడీ తెలుగు న్యూస్ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. గత వారం టీవీ ౯ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని తాజాగా మరో తెలుగు న్యూస్ ఛానెల్ అయినా ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.

నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా తన ఎక్స్‌(గతంలో ట్విట్టర్) అకౌంట్‌ ద్వారా పంచుకున్నారు. తెలంగాణలో బీజేపీ హవా కొనసాగుతోందని.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు దరదాపుల్లో కూడా లేవని ప్రధాని మోడీ తెలిపారు. ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ, జాతీయ రాజకీయాలకు సంబంధించిన చాలా అంశాలపై చర్చించినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ రోజు రాత్రి 8 గంటలకు ఈ ఇంటర్వ్యూ ప్రసారం కానుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఎన్టీవీ ఛానెల్‌కు చెందిన ప్రోమోను ప్రధాని మోడీ ఎక్స్‌ పోస్ట్‌లో పంచుకున్నారు.

Search

Latest Updates