తాండూర్, కామారెడ్డి సభల్లో ప్రియాంక గాంధీ

Published on

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇవాళ ఆఖరి రోజు. సాయంత్రం 6గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీలు తెలంగాణలో పర్యటించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తాండూరు, కామారెడ్డి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రియాంక వెంట సీఎం రేవంత్ రెడ్డికూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1గంటకు తాండూర్ జన జాతర సభకు ప్రియాంక గాంధీతో కలిసి హాజరవుతారు. ఆ తర్వాత సాయంత్రం 3.15 గంటలకు కామారెడ్డిలో జరిగే రోడ్ షోలో రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీతో కలిసి పాల్గోనున్నారు.

Search

Latest Updates