కొడంగల్‌లో ఓటేసిన రేవంత్ రెడ్డి

Published on

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి తన భార్య, కూతురుతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికలు మా వంద రోజుల పాలనకు రెఫరెండమని, దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. దేశంలో 336 సీట్లకే పోటీ చేసిన బీజేపీకి 400 సీట్లు ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. 13 ఏళ్లు సీఎంగా , 10ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ.. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదని అన్నారు విమర్శించారు.

Search

Latest Updates