యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీలు

Published on

తెలంగాణలోని 10 యూనివర్సిటీల వీసీల పదవీకాలం ఇవాళ్టితో ముగియడంతో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వంలో వివిధ శాఖాధిపతులుగా పనిచేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే కొత్త వీసీల కోసం అన్ని వర్శిటీలలో సెర్చ్‌ కమిటీలు ఏర్పాటయ్యాయి. జాబితాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోనుంది. అప్పటివరకు ఇన్‌ఛార్జి వీసీలుగా ఐఏఎస్ అధికారులు బాధ్యతల్లో కొనసాగనున్నారు.

ఇన్‌ఛార్జ్ వీసీల జాబితా ఇదే..

1.ఉస్మానియా యూనివర్సిటీ – దాన కిషోర్

2. జేఎన్టీయూ – బుర్ర వెంకటేశం

3. కాకతీయ – కరుణ వాకాటి

4. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ – రిజ్వి

5. తెలంగాణ వర్సిటీ – సందీప్ సుల్తానియా

6. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ – శైలజ రామయ్యర్

7. మహాత్మా గాంధీ యూనివర్సిటీ – నవీన్ మిట్టల్

8. శాతవాహన యూనివర్సిటీ – సురేంద్ర మోహన్

9. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ – జయేష్ రంజన్

10. పాలమూరు యూనివర్సిటీ – నదీం అహ్మద్.

Search

Latest Updates