రేవంత్ రెడ్డిపై మంద కృష్ణ మాదిగ మండిపాటు

Published on

సిగ్గులేని కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలోకి ఎలా తీసుకుంటావని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గతంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతుంటే 75 ఏళ్ల వయస్సులో పార్టీ మారడం ఏమిటి? ఆయ‌న‌ సిగ్గులేనోడని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను మంద‌ కృష్ణ గుర్తు చేశారు. ఇప్పుడు అదే 75 ఏళ్ల కడియం శ్రీహరి పార్టీలోకి వస్తుంటే రేవంత్ రెడ్డి ఆ సిగ్గులేనోడిని ఎలా పక్కన కూర్చోబెట్టుకున్నాడు? ఎలా పార్టీలోకి తీసుకున్నాడు? అని నిలదీశారు.

Search

Latest Updates