- పాలమూరు ఐటీ హబ్ భూముల్లో పల్లి పంట
- కరీంనగర్లో పట్టుమని పదుల సంఖ్యలోనే జాబ్లు
- వరంగల్లో టెకీలకు రూ. 12 వేలు దాటని శాలరీలు
- మహబూబ్నగర్, నిజామాబాద్లో స్లోగా బిల్డింగ్స్ నిర్మాణం
- టైంకు సర్కారు నిధులివ్వకపోవడంతో పనులు పెండింగ్
- వర్క్ స్టార్ట్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపని కంపెనీలు
- సిద్దిపేటకు ఐటీ టవర్.. 10న సీఎం శంకుస్థాపన
హైదరాబాద్కే పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లాల్లోనూ విస్తరిస్తామని చెప్పిన రాష్ట్ర సర్కారు ఆ దిశగా సక్సెస్ కాలేదు. కొద్ది నెలల కింద కరీంనగర్, అంతకుముందు వరంగల్లో ప్రారంభించిన ఐటీ సెంటర్లలో వర్క్స్టార్ట్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఆయా జిల్లాల్లో పట్టుమని పదుల సంఖ్యలోనూ ఉద్యోగాలు రాలేదు. అక్కడ టెకీల శాలరీస్ రూ. 12 వేలు కూడా దాటట్లేదు. ఇక మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో బిల్డింగ్ పనులు డెడ్ స్లోగా నడుస్తున్నాయి. మహబూబ్నగర్లో ఐటీ హబ్ కోసం సేకరించిన భూముల్లో పల్లి సాగు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వేల ఉద్యోగాలన్నారు.. పదుల్లోనూ ఇవ్వలేదు
కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యామ్ సమీపంలో రూ. 34 కోట్ల అంచనాతో నిర్మించిన ఐటీ టవర్ను ఈ ఏడాది జులై 21న రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గ్రాండ్గా ప్రారంభించారు. 11 కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నాయని షిఫ్ట్కు 1,100 నుంచి 1,200 మంది చొప్పున 3,300 నుంచి 3,600 మందికి జాబ్స్ వస్తాయని లీడర్లు, ఆఫీసర్లు ప్రకటించారు. కంపెనీలకు స్పేస్ అలాట్ చేసి సుమారు నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆశించిన ప్రోగ్రెస్ లేదు. టవర్ ప్రారంభం రోజు 432 మందికి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వగా ప్రస్తుతం ఒకటీ రెండు కంపెనీలకు చెందిన పది, పదిహేను మందికి మించి పనిచేయడం లేదు. దీంతో ఘనంగా ప్రారంభమైన ఐటీ టవర్ ప్రస్తుతం వెలవెలబోతోంది. ఇదే క్యాంపస్లో ఏర్పాటుచేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) రీజినల్ సెంటర్ యాక్టివిటీస్ కూడా ప్రారంభం కాలేదు.
ఖమ్మంలో మూడేండ్లకు పూర్తయిన నిర్మాణం
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ నిర్మాణం మూడేండ్ల తర్వాత పూర్తయింది. మంత్రి కేటీఆర్ సోమవారం దీన్ని ప్రారంభించ నున్నారు. 2017లో రూ.25 కోట్లతో నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. 16 కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి చూపుతామని అంటున్నప్పటికీ కరీంనగర్, వరంగల్ అనుభవాలు చూశాక ఇక్కడి నిరుద్యోగులూ డల్ అవుతున్నారు.
11 కంపెనీలు అగ్రిమెంట్ చేసుకున్నాయని షిఫ్ట్కు 1,100 నుంచి 1,200 మంది చొప్పున 3,300 నుంచి 3,600 మందికి జాబ్స్ వస్తాయని లీడర్లు, ఆఫీసర్లు ప్రకటించారు. కంపెనీలకు స్పేస్ అలాట్ చేసి సుమారు నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆశించిన ప్రోగ్రెస్ లేదు. టవర్ ప్రారంభం రోజు 432 మందికి జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వగా ప్రస్తుతం ఒకటీ రెండు కంపెనీలకు చెందిన పది, పదిహేను మందికి మించి పనిచేయడం లేదు. దీంతో ఘనంగా ప్రారంభమైన ఐటీ టవర్ ప్రస్తుతం వెలవెలబోతోంది. ఇదే క్యాంపస్లో ఏర్పాటుచేసిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్) రీజినల్ సెంటర్ యాక్టివిటీస్ కూడా ప్రారంభం కాలేదు.
శాలరీలు రూ.12 వేలు దాటట్లే
వరంగల్ మడికొండ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఏడాది జనవరి 7న టెక్ మహీంద్రా న్యూ బ్రాంచ్, సైయెంట్ఐటీ సెంటర్ న్యూ బిల్డింగ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఓరుగల్లుకు ఐటీ సెంటర్లు రావడానికి ఇది ఆరంభమేనని, ఐటీ రంగంలో వరంగల్ సిటీని ముంబై, పుణెలా మారుస్తామని హామీ ఇచ్చారు. దగ్గర్లో హెలికాప్టర్ ల్యాండింగ్ సెంటర్ పెడతామన్నారు. వీటి ద్వారా 8 వేల నుంచి 9 వేల మందికి జాబ్స్ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ వేల మందికి కాదు కదా 200 మందికి మించి జాబ్లు రాలేదు. సిస్టమ్ ఇంజినీర్ల మంత్లీ శాలరీలు రూ.12 వేల నుంచి రూ. 14 వేలు దాటట్లేదు. కొత్తగా మరే ఐటీ కంపెనీ రాలేదు. దీంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారు.
రెండు జిల్లాల్లో ఇంకా ఎక్కడికక్కడే
మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో ఐటీ సెంటర్ల నిర్మాణం డెడ్స్లోగా సాగుతోంది. మహబూబ్నగర్లో సుమారు 400 ఎకరాల్లో నిర్మిస్తున్న దివిటిపల్లి ఐటీ ఇండస్ట్రీయల్ పార్కుకు మంత్రి కేటీఆర్ 2018 జులై 7న శంకుస్థాపన చేశారు. ఈ ఐటీ పార్కుతో పాలమూరు దశ తిరుగుతుందని, 15 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. 23 ఐటీ కంపెనీలతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. గతేడాది రూ. 28 కోట్లతో ఐటీ టవర్ నిర్మాణ పనులకు మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి 2019 నవంబర్ 1న భూమి పూజ చేశారు. కానీ సరిపడా ఫండ్స్ లేక పనులు లేట్ అవుతున్నాయి. దీంతో భూములు ఇచ్చిన రైతులు మళ్లీ పల్లి చేన్లు వేశారు. 40 శాతం పనులే పూర్తయ్యాయి. నిజామాబాద్సిటీలో కొత్త కలెక్టరేట్ పక్కన రూ. 25 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్కు రెండేండ్ల కింద మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసినా పనులు లేట్ అవుతున్నాయి.
సిద్దిపేటకు ఐటీ టవర్ 10న సీఎం శంకుస్థాపన
సిద్దిపేట : సిద్దిపేటకు ఐటీ టవర్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. గజ్వేల్ సెగ్మెంట్ కొండపాక మండలం దుద్దెడ గ్రామ పరిధిలోని 668 సర్వే నెంబరులో 3 ఎకరాల ప్లేస్ను కేటాయించి, టవర్ నిర్మాణ పనులకు రూ. 45 కోట్లు మంజూరు చేసింది. ఈ నెల 10న సీఎం కేసీఆర్ టవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజీవ్ రహదారిని ఆనుకొని నాగులబంద వద్ద నిర్మించిన ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, టూరిజం హరిత హోటల్ మధ్యలో 3 ఎకరాల్లో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ నిర్మించనున్నారు. ఈ నెల 10న సీ శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన సమక్షంలోనే ఇన్ఫోసిస్ తో పాటు పలు కంపెనీలతో ఐటీ శాఖ ఎంవోయూలు కుదుర్చుకోనుంది.
Courtesy V6Velugu