Kishan Reddy: ఎంఐఎం ,కాంగ్రెస్ దొందుదొందే

Published on

ఎంఐఎం,  కాంగ్రెస్ పార్టీ దొందుదొందే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకు వస్తానన్నా మార్పు ఏమైందని ప్రశ్నించారు. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు.. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లో మార్పు వచ్చిందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. మతాన్ని అడ్డం పెట్టుకొని ఎంఐఎం రాజకీయాలు చేస్తుందంటూ మండిపడ్డారు. తెలంగాణలో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని రగిలిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎంలు హైదరాబాద్ అభివృద్ధిని గాలికొదిలేశాయని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలు కొత్త నాటకానికి తెర తీశాయన్నారు. ఓట్లు కోసం కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఎంతకైనా దిగజారతాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Search

Latest Updates