కృష్ణ మాదిగను కలిసిన పెద్దపల్లి ఎంపీ

Published on

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కలిశారు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని. మర్యాదపూర్వకంగా కలుసుకున్నాము తప్ప ఎటువంటి రాజకీయాలు తమ మధ్య చర్చకు రాలేదని వెంకటేష్ నేత తెలిపారు.

వెంకటేశ్ నేత 2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. సిట్టింగ్ అభ్యర్థని కాదని ఈసారి బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్‌కు టిక్కెట్ ఇవ్వడంతో వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అంతలోనే మళ్లీ ఈరోజు కమలం పార్టీ కండువాను కప్పుకున్నారు. అయితే ఇప్పటికే పెద్దపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్‌ను ప్రకటించడంతో ఆయన గెలుపుకు కృషి చేస్తానని ప్రకటించారు.

Search

Latest Updates