ఎన్నికల ప్రచారంలో విక్టరీ వెంకటేష్.!

Published on

ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సినీ హీరో విక్టరీ వెంకటేష్. మే 7 నుంచి ఖమ్మం జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు.

రఘురాం రెడ్డికి సినీ హీరో వెంకటేష్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు వియ్యంకులు అవుతారు. దీంతో తన వియ్యంకుడిని గెలిపించేందుకు వెంకటేష్‌ రంగంలోకి దిగుతున్నారు. ఇక రఘురాం రెడ్డికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రితను, చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమార్తె సప్ని రెడ్డిని వివాహం చేసుకున్నారు.

ఇప్పటికే రఘురాం రెడ్డి తరపున కాంగ్రెస్ మంత్రులు ,నేతలు ప్రచారం చేస్తున్నారు..ఇపుడు వియ్యంకుడు తరపున వెంకటేష్ తొలిసారి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

Search

Latest Updates