గ్రేటర్‌లో భారీ వర్షం..పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌

Published on

జంటనగరాలైన ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. జీహెచ్‌ఎంసీ ఆఫీసు దగ్గర అత్యధికంగా 8.4 సెంటీమీటర్లు, మియాపూర్ లో 2.8 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. వర్షం, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా బంద్‌ అయ్యింది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనం తాకిడితో మెట్రో రైలును కాసేపు నిలుపుదల చేశారు అధికారులు.

Search

Latest Updates