మోయినాబాద్‌లో దారుణం..స్విమ్మింగ్ పూల్‌లో పడి విద్యార్థి మృతి

Published on

మోయినాబాద్‌లో దారుణం జరిగింది. స్విమ్మింగ్ పూల్‌లో పడి రెండో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మోయినాబాద్‌ మండలంలోని నాగిరెడ్డి గూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సుజాత స్కూల్లో సమ్మర్ క్యాంపు పేరుతో విద్యార్ధులకు ట్రైయినింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో మే 10వ తేదీ శుక్రవారం స్విమ్మింగ్ ట్రైన్నింగ్ తీసుకుంటూ బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించాడు.

మృతి చెందిన విద్యార్థిని మొయినబాద్ మండలంలోని సురంగల్ గ్రామానికి చెందిన గాండ్ల శివశౌర్య(7)గా గుర్తించారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయం బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నం చేసింది. కానీ విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు.. స్కూల్ పీఈటీలకు దేహశుద్ధి చేసి చేసినట్లు సమాచారం.

Search

Latest Updates