ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

Published on

లోక్‌ సభ ఎన్నికలకు నేడు తెలంగాణలో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది. 17 లోక్‌ సభ స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే..ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జూబ్లీహిల్స్‌లోని ఓబుల్‌రెడ్డి స్కూల్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. జూబ్లీహిల్స్‌లో సినీనటుడు చిరంజీవి తన భార్య సురేఖ, కూతురుతో కలిసి ఓటు వేయగా, అల్లు అర్జున్ ఫిలింనగర్‌లో ఓటు వేశారు.

మలక్ పేటలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, బర్కత్‌పూర్‌లో కేంద్రమంది కిషన్ రెడ్డి, తార్నాకలో ఎమ్మెల్సీ రాంచదర్ రావు ఓటు వేశారు. మెడ్చల్ జిల్లా పూడుర్‌లో బీజేపీ నేత ఈటెల రాజేందర్ తన ఓటు హక్కును వినియోగించుకోగా, సిద్దిపేటలోని భరత్ నగర్ అంబిటాస్ స్కూల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు.

Search

Latest Updates