ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం…

Published on

పార్లమెంట్ సీట్లలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు మూడు సీట్లు ఉంటే, రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు.

దళితుల్లో 20% గళ్ళ మాలలకు రెండు సీట్లు కేటాయించి, ఊరుకొక్కరు లేని బైండ్ల కులానికి ఒక సీటు ఇచ్చిన రేవంత్ రెడ్డి, దళితుల్లో 75% గల మాదిగలకు ఒక్క సీటు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో మల్లు కుటుంబానికి, గడ్డం వివేక్ కుటుంబానికి ఉన్న విలువ మాదిగ జాతికి లేదని, అందుకు కేటాయించిన స్థానాలే సాక్ష్యమని అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి స్థానికేతరుడై ఉన్నా, స్వయంగా డిప్యూటీ సీఎం సోదరుడైనా, తాను కేబినెట్ హోదాతో ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమించబడి ఉన్నా కూడా మల్లు రవి గారికే అట్టి స్థానాన్ని కేటాయించడం, అదే విధంగా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో రెండు నియోజకవర్గాల నుండి ఒకే కుటుంబం నుంచి గడ్డం వివేక్, గడ్డం వినోద్ లు చెన్నూరు, బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నా , మల్లి ఆ పార్లమెంట్ స్థానాన్ని వారి కుటుంబానికే ఇప్పించుకోవడం, వరంగల్ లో మాదిగలను రాజకీయంగా అడుగడుగునా అనిచివేసిన రాజకీయ అవకాశవాధి, ఊరికి ఒక్కరు లేని బైండ్ల కులానికి చెందిన శ్రీహరి గారికి ఇవ్వడం చూస్తుంటే అది అర్ధం అవుతుందని గుర్తుచేశారు.తెలంగాణ లో నాలుగు శాతం జనాభా కలిగిన తమ రెడ్డి కులానికి ఆరు సీట్లను కేటాయించుకున్న రేవంత్ రెడ్డి, 12 శాతం జనాభా గల మాదిగలకు స్థానమే లేకుండా చేయడం, 50% జనాభా కలిగిన బీసీలకు 2 స్థానాలే కేటాయించి ద్రోహం చేశాడని, కాంగ్రెస్ ముమ్మాటికీ ప్రజా ప్రభుత్వం కాదు, రెడ్ల, మాలల ప్రభుత్వమేనని అన్నారు. మాదిగల మద్దతుతోనే నేను ఈ స్థాయికి ఎదిగిన అని, నాసొంత కులం నన్ను పట్టించుకోకపోయినా మాదిగలు మాత్రం నా ప్రతి ఎదుగుదలలో వెన్నంట ఉన్నరని అనేక వేదికల మీద మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాదిగలకు అవకాశాలను ఇవ్వకుండా అవమాన పరుస్తూ నమ్మకద్రోహానికి పాల్పడ్డాడని అన్నారు. నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ లో దశాబ్దాల తరబడి కాంగ్రెస్ కు సేవ చేస్తూ టికెట్ ఆశించిన మాదిగ నేతల రాజకీయ ఎదుగుదలను సమాధి చేశారని మండిపడ్డారు. మాదిగలకు ద్రోహం చేసిన పార్టీలన్నీ కాలగర్భంలో కలిసిపోయాయని ఇదే ధోరణిని అవలంబిస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు.కాంగ్రెస్ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని రెండు పార్లమెంట్ స్థానాలను మాదిగలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. MP స్థానాల్లో మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి వైఖరికి నిరసనగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామని తెలిపారు.ప్రచారాలు కాదు, ఆచరణలో కాంగ్రెస్ నైజాన్ని, మన వర్గాలకు చేస్తున్న ద్రోహాన్ని గ్రహించి ప్రజలు కాంగ్రెస్ కు తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ, ఎం ఎస్ పి బోత్ నియోజవర్గ ఇన్చార్జి దుబ్బాక సుభాష్ మాదిగ సిరిసిల్ల భూమయ్య మాదిగ మచ్చ గంగయ్య, కల్లేపల్లి రాజు, గోటిముఖేలే మధుకర్ మాదిగ,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు చిట్టీ రవి మాదిగ, రాజు మాదిగ కసిపాక విష్ణు మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు పసుల శ్రీకాంత్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు…

Search

Latest Updates