Maoist | బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు మావోయిస్టులు మృతి

Published on

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతా సిబ్బందికి మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్దెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో భద్రతా సిబ్బంది బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఉండగా కాల్పులు జరిగినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కాల్పుల విరమణ అనంతరం ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలతో పాటు.. ఆయుధాలు లభ్యమైనట్లు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని జిల్లా పోలీసు అధికారి తెలిపారు.

Search

Latest Updates