ఆమ‌న‌గ‌ల్లు లో ఘోర రోడ్డు ప్రమాదం…ముగ్గురు మృతి

Published on

హైద‌రాబాద్ – శ్రీశైలం జాతీయ ర‌హ‌దారిపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. రంగారెడ్డి జిల్లా ఆమ‌న‌గ‌ల్లు మండ‌లం రాంనుంత‌ల శివారులో ఆర్టీసీ బ‌స్సు – కారు ఢీకొన్నాయి. కారులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల‌ను హైద‌రాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. కల్వకుర్తి నుండి హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అతివేగం, నిద్ర మ‌త్తు కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

Search

Latest Updates