కాంగ్రెస్‌లో చేరిన శ్రీకాంత్ చారీ తల్లి

Published on

మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంత్ చారి తల్లి కాసోజు శంకరమ్మ గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగున్న వేళ కాసోజు శంకరమ్మ కాంగ్రెస్‌లో చేరడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

గతంలో ఆమె డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి సన్మానించింది. ఈ సందర్భంగా ఆమె యోగక్షేమాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. అప్పుడే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నది అనే వదంతులు వినిపించాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శంకరమ్మకు ఎలాంటి పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ అనేకమార్లు విమర్శించింది. అయితే ఆమెకు కాంగ్రెస్ పార్టీ తగు ప్రాధాన్యత ఇచ్చి గౌరవిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Search

Latest Updates