తెలంగాణకు చల్లని కబురు

Published on

శుక్ర, శనివారాల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం తెలిపింది. తమిళనాడులో ద్రోణి ఏర్పడి అది తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని, ముఖ్యంగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు.

గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని అంచనా వేశారు. శుక్రవారం నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, అసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, మంచిర్యాల, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

Related Posts

No Content Available
Search

Latest Updates