పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించిన వికాస్ రాజ్

Published on

పార్లమెంట్‌ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు ముమ్మురం చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సరళిని సోమవారం అబిడ్స్‌లోని ఆల్‌ సెయింట్‌ హైస్కూల్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌(Vikas Raj) పరిశీలించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోలార్డ్ రాస్, జిల్లా పోలీసు అధికారి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో కలిసి పోలింగ్‌ రిజిస్ట్రేషన్‌, ఓటర్ల రిజిస్ట్రేషన్‌, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఓటింగ్‌ సరళి వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంత ఎక్కువ మంది ఓటు వేస్తే అంత మంచి వ్యక్తిని ఎన్నుకునే అవకాశం వుంటుందన్నారు. హైదరాబాద్‌లో పోలింగ్ శాతం పెరిగేలా కృషి చేస్తున్నామన్నారు. సీనియర్ సిటిజన్స్ ఓటు వేసేందుకు ఫ్రీ రైడ్ కల్పిస్తున్న ర్యాపీడో సేవలను అభినందించారు వికాస్ రాజ్.

Search

Latest Updates