మొగిలయ్యకు టీవీ నటి సాయం

Published on

తెలంగాకు చెందిన కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు టీవీ నటి సాయం చేసింది. పద్మశ్రీ అవార్డు గ్రహిత అయిన మొగిలయ్యకు ప్రభుత్వం నుంచి వస్తున్న పించన్ ఆగిపోవడంతో కొద్ది రోజుల నుంచి కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలు కావడంతో ఆర్ధిక సాయం చేయడానికి దాతలు ముందుకు వస్తున్నారు. గత వారం బీఆర్ఎస్ నాయకులు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మొగిలయ్యను కలిసి ఆర్ధిక సాయం చేసిన విషయం తెలిసిందే.

అయితే తన టీమ్ ద్వారా మొగిలయ్య విషయాన్ని తెలుసుకున్న జ్యోతిరాయ్ అక్షయ తృతీయనాడు తన వంతుగా రూ.50 వేలు సాయం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని…కానీ తన ఇబ్బందుల కంటే మొగిలయ్య పరిస్థితి ఎక్కువగా కలిచివేసిందని పేర్కొంది. అనంతరం మొగిలయ్య పాదాలకు నమస్కరించి ఆశ్వీరాదం తీసుకుంది.

Search

Latest Updates