లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న నేపథ్యంలో నల్లకుంట లోని శంకర మఠ్ ఆలయంలోని శ్రీ శృంగేరి అమ్మవారిని దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. నామీనేషన్ పత్రాలను అమ్మవారి పాదాలచెంత వుంచి ఆశీర్వాదం స్వీకరించారు. ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న నేపథ్యంలో అభిమానులతో కలిసి భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించారు.