స్పెషల్ స్టేటస్ ముగిసిపోయిన అంశం: కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Published on

AP: ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన వేళ కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశం అంటూ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఏపీకి ప్రత్యేక ప్యాకేజి ఇచ్చిందని తెలిపారు. విభజన చట్టం హామీలను కూడా అమలు చేసిందని పేర్కొన్నారు.

ఏపీ ప్రజలకు వైజాగ్‌ స్టీల్‌ ఒక సెంటిమెంట్‌ అని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు. ఏపీ ప్రజలకు మేలు జరిగేలా అడుగులు వేస్తానని స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లు కూటమితో కలిసి ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

అయితే, కేంద్రంలోని కొత్త మంత్రి వర్గంలో శ్రీనివాసవర్మకు చోటు కల్పించడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేల సమావేశంలో తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు అన్న పొగడ్తలు గురిపించి రెండు రోజులు గడవక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదంటున్నారు ఇరు పార్టీలకు చెందిన నేతలు.

Search

Latest Updates